నిజామాబాద్
గత ఎన్నికల్లో పసుపు బోర్డు పై ఫోకస్ చేసి సాధించాం. ఈ సారి ఉద్యోగ అవకాశాలు పెంచడం పై ద్రుష్టిపెడతామని ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. గల్ఫ్ వలసలు నివారిస్తాం. వృత్తి శిక్షణ ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. బీడీ కార్మికుల కోసం ప్రత్యేక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదు. కొత్త రేషన్ కార్డ్ లు లేక పేదవారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రేషన్ కార్డ్ ఇవ్వక పోవడం సిగ్గుచేటు. రోటీ ,కాపాడా , ఘర్ ఇవి ఏమి రాష్ట్ర ప్రభుత్వం పట్టిచ్చుకోవడం లేదని విమర్శించారు.