
బెంగళూరు
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల ద్వారా 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని, తుంగభద్ర ప్రాజెక్టు నుండి 1టీఎంసీ నీటిని ఆర్డీఎస్ కు విడుదల చేయాలని కోరుతూ.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ,ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి బోస్ రాజు ల ను బెంగళూరు లో కలసి రిప్రెసెంటేషన్ అందజేశారు ఐటీ శాఖ మంత్రిలు శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు గద్వాల దేవరకద్ర మక్తల్ శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీహరి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కలిసారు.
కర్ణాటక ముఖ్యమంత్రి, సానుకూలంగా స్పందించి, 4 టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపారని తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వానికి... తెలంగాణ ప్రభుత్వం తరఫున నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.