
సికింద్రాబాద్
పద్మారావు నగర్ లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కులగణను రీ సర్వే చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పులతడకగా ఉన్నది.... లెక్కలలో స్పష్టత లేదని అన్నారు.
ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి. 2014 లో కేసీఆర్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే లో 62 లక్షల మంది సంఖ్య తగ్గింది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికల లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.