YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ టూ విజయవాడ రూ.99లకే

హైదరాబాద్ టూ విజయవాడ రూ.99లకే

హైదరాబాద్, ఫిబ్రవరి 7, 
హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఫ్లిక్స్‌ ఈవీ బస్సుల్ని తెలంగాణ రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్‌ బస్‌ ఇండియా ఈ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈవీ (విద్యుత్‌ వాహనాలు)లను ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి ప్రభాకర్.‌ ప్రతి వాహనం ఈవీ ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని.. ఈ మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 'రాష్ట్రంలో ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చాము.. ఈ విధానం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా.. నగరంలోని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని.. ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుంది' అన్నారు మంత్రి'ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్ ఎలక్ట్రిక్ బస్సును మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడం రాష్ట్రంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న కొత్త చర్యలు చూపిస్తాయి. రవాణా శాఖకి సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలి.. 
ఈవీ బస్సుల వినియోగం పెరిగితే, భవిష్యత్తులో మరిన్ని రకాల ఈవీ బస్సులు ప్రవేశపెట్టాలి' అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఈవీ బస్సులు మూడు, నాలుగు వారాల తర్వాత నడుస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా తమ బస్సుల్ని ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాదు సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఐదు గంటల్లో బస్సులు గమ్యానికి చేరుకుంటాయని.. అన్ని ప్రభుత్వ పథకాలు తమ బస్సుల్లోనూ వర్తిస్తాయని కూడా చెప్పారు. ఈ బస్సుల్లో 49మంది ప్రయాణించే సదుపాయం ఉందని.. రాబోయే రోజుల్లో స్లీపర్‌ కోచ్‌లతో బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

Related Posts