
హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ సమస్యపై ఎన్ని మార్లు వినతి పత్రాలు సమర్పించిన కూడా ఎటువంటి సమాధానం రాకపోవడంతో సమ్మె కార్యక్రమానికి పిలుపు నివ్వడం జరుగుతుందని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 15 రోజులు క్రితం ఆర్టిసి ఎండి సజ్జనార్ కు వినతి పత్రాలు సమర్పించడంతో మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షించి వివరిస్తాననీ చెప్పి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని ద్వజమెత్తారు. 2 వేల 7 కోట్ల ఆర్టిసి కార్మికుల డబ్బులను ప్రభుత్వం తీసుకొని మొండి చేయి చూపిస్తుందని మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మె బాట పడతామని హెచ్చరించారు.