
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి: 14
ఈరోజు ఫిబ్రవరి 14! కొందరికి ఇది లవర్స్ డే, కానీ దేశభక్తులందరికీ బ్లాక్ డే! ఎందుకంటే ఇదే రోజు, 2019లో, మన దేశాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు ఘోరమైన దినం. పుల్వామా దాడి జరిగి, మన సైనిక సోదరులు అమరులయ్యారు. ప్రేమంటే రొమాన్స్ కాదు, దేశం కోసం చస్తానని చెప్పే తపనే నిజమైన ప్రేమ గులాబీలు ఇచ్చుకోవడం కాదు, రక్తాన్ని ధారపోసి జెండా ఎగరించడం నిజమైన ప్రేమ ఈ రోజు, మనం ప్రేమ గురించి మాట్లాడాలి… కానీ దేశాన్ని ప్రేమించే ప్రేమ గురించి! మన భవిష్యత్తును కాపాడే సైనికుల గురించి మనకు రక్షణగా నిలిచిన భారత ఆర్మీ గురించి! అందుకే ఈ రోజు బ్లాక్ డే. పాకిస్తాన్ మాయమాటలు చెప్పినా, మనం మర్చిపోం! మన జవాన్ల త్యాగం వృధా కాదు! ప్రతీ భారతీయుడి గుండెలో కడుపు మంటగా ఉంటేనే, శత్రువులకు గుణపాఠం చెప్పగలం! కాబట్టి, నా అన్నదమ్ములారా, ఫిబ్రవరి 14ను ప్రేమ పండుగగా కాదు, దేశభక్తి ప్రమాణంగా జరుపుకుందాం నిజమైన వీరుల ప్రేమకు న్యాయం చేద్దాం!