
దోమలపెంట
ఫార్మ్ హౌజ్ లో కూర్చుని పాలన చెయ్యడం లేదు. ప్రజధనాన్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం మాది కాదు. సహజ సిద్ధంగానే నేను పైలెట్ ను. యుద్ద విమానాలు నడిపిన అనుభవం నాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్ తో కుమ్మకై కృష్ణా జలాలను ఆంధ్రకు సమర్పించిన చరిత్ర బి.ఆర్.ఎస్ పాలకులది.. ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ కు విద్యుత్ సరఫరా నిలిపినప్పుడు జగదీశ్ రెడ్డి ఎందుకు స్పందించ లేదు. బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించారు. హరీష్ రావు విమర్శలు అర్ధరహితం,
సంఘటనా స్థలి వద్దకు బి.ఆర్.ఎస్ నేతల పర్యటన ఆసాంతం రాజకీయ డ్రామా అని ఆరోపించారు.1.81 లక్షలతో కట్టిన కాళేశ్వరం కూలిపోయినప్పుడు మీ గొంతులు ఎందుకు పెగల లేదు. 27,500 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఒక్క ఎకరాకు నీరు అందించ లేక పోయారు. కార్మికులను సురక్షితంగా బయట పడేసేందుకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నారు. అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో టన్నెల్ బోరింగ్ మిషన్లు,డి వాటరింగ్ పునరుద్ధరణ జరుగుతొంది. రెండు-మూడు నెలల్లో ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ వుంటుందని అన్నారు.