
హైదరాబాద్
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు శనివారం కలిసారు. వరంగల్ ఎంపీ కావ్య, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు భరత్ సింహారెడ్డి, తదితరులు సీఎం ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎంకు అభినందనలు తెలిపారు.