
నల్గోండ
వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల పరిశీలకులు ,రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ ,పర్యావరణ మరియు అటవీ,సైన్స్ &టెక్నాలజీ శాఖ అహ్మద్ నదీమ్ , జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి , వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ , ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లు తెరిచి లెక్కింపు ప్రదేశానికి బ్యాలెట్ బాక్సులను తరలించారు.