YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కార్మిక వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.

కార్మిక వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.

సింగరేణి కార్మిక వర్గాన్ని కంటికి రెప్పోలె కాపాడుకుంటాం,,  వారి సమస్యల పరిష్కారం కోసం ఎక్కడి దాకైనా వెళ్లడానికి ఐ ఎన్ టి యు సి పక్షాన మేము సిద్ధంగా ఉన్నామని ఐ ఎన్ టి యు సి ఆర్జి టు వైస్ ప్రెసిడెంట్ బాదావత్ శంకర్ నాయక్, కేంద్ర ప్రధాన కార్యదర్శి అక్రమ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఓసిపి త్రీ లో అపరిస్కృతంగా ఉన్న పలు సమస్యలపై మేనేజర్ భరత్ కుమార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలోని సింహభాగం ఉత్పత్తిని అందిస్తున్న ఓసిపి త్రీ కార్మికులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఓసిపి లోని సమస్యలను పరిష్కరించడం ద్వారా ఉత్పత్తి సైతం పెరుగుతుందని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యంగా డంపర్ల యొక్క సస్పెన్షన్లు పూర్తిగా చెడిపోయినందున కార్మికులకు తీవ్రమైన నడుము నొప్పులు వస్తున్నాయన్నారు. దీంతో కార్మికులు రెగ్యులర్గా డ్యూటీలు సైతం చేయలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే హాల్ రోడ్ల పరిస్థితి కూడా కొంత ఇబ్బందిగా మారిందన్నారు. దుమ్ము, ధూళి నివారణకై సరిపడ ట్యాంకర్లను , గ్రేడర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి మిషనరీ కి సంబంధించి క్యాబిన్లకు ఉన్నటువంటి విండోస్ ను, బీడింగ్లను ఏర్పాటుచేసి  ఏసీలు పనిచేసేలా చూడాలన్నారు .ఇకపోతే 60 పార్కింగ్ యార్డులో రెస్ట్ సెల్టర్ ను  ఏర్పాటు చేయడంతో పాటు డస్ట్ క్లీనర్ యంత్రాన్ని సైతం ఏర్పాటు చేయాలన్నారు. డ్రిల్ ఆపరేటర్లకు సంబంధించి డ్రిల్లులకు అన్ని విధాల మరమ్మత్తులు చేపించడంతోపాటు వారికి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కొరత లేకుండా చూడగలరాన్నారు. పేస్ టుకు సంబంధించి సరిపడా మ్యాన్ పవర్ ను కేటాయించాలన్నారు. అన్ని డంపర్లకు  షెడ్యూల్ ప్రకారం వాటర్ సర్వీసింగ్ చేపించాలన్నారు.అదేవిధంగా ఓసిపి లోని జనరల్ మజ్దూర్లను ఒక పనికి కేటాయించిన తర్వాత మరొక పనికి కేటాయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫేస్ టు లో కన్వేయర్ ఆపరేటర్లుగా యాక్టింగ్ చేస్తున్న వారిని ప్రమోషన్స్ ఇచ్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. టెక్నీషియన్లకు సరిపడా టూల్సును అందించాలన్నారు. వేసవికాలం సమీపిస్తున్నందున ట్రిప్మెన్లకు సరిపడ రెస్ట్ సెల్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా రెస్ట్ హాల్లో దుమ్ము ధూళి, కోతుల బెడద ఉన్నందున పాడైపోయిన విండోస్ ను తొలగించి కొత్త కిటికీలను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలు విన్న ఓసిపి 3 గని మేనేజర్ భరత్ కుమార్ మాట్లాడుతూ సత్వరమే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు  ఓసిపి త్రీ కి చేరుకున్న వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, కేంద్ర ప్రధాన కార్యదర్శి అక్రమ్ వెంట సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించుటకై కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో  ఐ ఎన్ టి యు సి జాయింట్ సెంటర్ సెక్రటరీ దశరథం గౌడ్, కేంద్ర నాయకులు సాలిగామ మల్లేష్ తో పాటు ఇతర కేంద్ర, డివిజన్ నాయకులు సంపత్ రెడ్డి, రవీందర్,భీముని సత్యనారాయణ,కొక్కిరాల శ్రీనివాస్,ఆకుల రాజయ్య, తోకల సమ్మయ్య, ఇట్ల శ్రీనివాస్, వేల్పుల తిరుపతి రెడ్డి,గుర్రం రవి,మల్లికార్జున్, పెగడపల్లి శ్రీను, గాజుల రామచందర్, పోచంపల్లి మధు ,చేరాలు, జనార్దన్ రెడ్డి తో పాటు తదితర కార్మికులు ఉన్నారు.

Related Posts