YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాష్ట్ర రియాల్టీ మార్కెట్ లో మరో దిగ్గజం

రాష్ట్ర రియాల్టీ మార్కెట్ లో మరో దిగ్గజం

హైదరాబాద్
రియల్టీ మార్కెట్లోకి మరో కార్పొరేట్ దిగ్గజం ప్రవేశిస్తోంది. జువారీ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జువారీ ఇన్ఫ్రావరల్డ్ ఇండియా లిమిటెడ్.. గంగోత్రి డెవలపర్స్తో కలిసి బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారీ హౌసింగ్ ప్రాజెక్టు చేపడుతోంది. కొల్లూరు మైక్రో మార్కెట్ సమీపంలో 9.4 ఎకరాల్లో ‘జువారీ గంగోత్రి త్రిభుజ’ పేరుతో ఈ ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.1,500 కోట్లకు పైగా వెచ్చించనుంది. రాష్ట్ర సిమెంట్ రంగంలో ఉన్న జువారీ గ్రూప్నకు హైదరాబాద్లో ఇదే తొలి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా 53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొమ్మిది టవర్లతో 1,730 అపార్ట్మెంట్లు నిర్మిస్తారు.

Related Posts