YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ

రాయలసీమ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ

అనంతపురం
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద మంగళవారం  తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్ప్రెస్కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిలిపారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడ్డారు. మొత్తం పది బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Posts