YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాళేశ్వరం విచారణకు హాజరైన కేసీఆర్

కాళేశ్వరం విచారణకు హాజరైన కేసీఆర్

హైదరాబాద్, జూన్ 11
కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను వన్‌ టు వన్‌ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్‌ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు కమిషన్‌ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో మాజీ సీఎం కేసీఆర్ విచారణ పూర్తి అయింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ ఆయన్ని కమిషన్ విచారించింది. అనుమానం ఉన్న వివిధ అంశాలపై ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌లో జరిగే పీసీ ఘోష్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన్ని కమిటీ హాల్‌లోకి తీసుకెళ్తే తనకు వేరుగా విచారించాలని రిక్వస్ట్ చేశారు కేసీఆర్. ఆయన అభ్యర్థనను ఘోష్‌ అంగీకరించారు. మిగతా నాయకులను బయటకు పంపేశారు. కేసీఆర్‌ను ఓ రూమ్‌లో ఉంచి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం అందుతోంది. జలుబు ఉందని అందుకే తాను గట్టిగా మాట్లాడలేనని కేసీఆర్ చెప్పారని సమాచారం. ఎక్కువ మంది ఉన్న హాల్‌లో విచారిస్తే తన మాట సరిగా వినిపించకపోవచ్చని కూడా వివరించారు. ఆయన అభ్యర్థనను మన్నించిన పీసీఘోష్ కమిషన్ ఒంటరిగా ప్రత్యేక రూమ్‌లో విచారించేందుకు ఓకే చెప్పింది. విచారణ సందర్భంగా తన వెంట తెచ్చుకున్న కీలకమైన డాక్యుమెంట్స్‌ను కూడా కేసీఆర్ అధికారులకు వివరించారని తెలుస్తోంది. విచారణ అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కారు డోరులో నిలబడి.. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. నేరుగా హైదరాదాద్ లోని బీఆర్కే భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు కేసీఆర్‌ పయనమయ్యారు.కోర్టు హాల్‌లో కేవలం ముగ్గురికే అనుమతిచ్చిన కమిషన్‌.. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలను బయటకు పంపించారు. కోర్టు హాల్‌లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతించింది. విచారణలో జస్టిస్ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ కలిసి కేసీఆర్ ను ప్రశ్నించారు.కాగా.. బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్‌ నిలిచారు. గతంలో జస్టిస్‌ శ్రీరాములు కమిషన్‌ ముందు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ హాజరయ్యారు. మల్లెల బాజ్జీపై హత్యాయత్నం కేసులో విచారణను ఎదుర్కొన్నారు ఎన్టీఆర్‌.. మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్‌ తర్వాత… BRK భవన్‌లో న్యాయవిచారణ ఎదుర్కొన్న రెండో సీఎంగా కేసీఆర్‌ నిలిచారు.మొదట ఓపెన్‌ కోర్టులో కేసీఆర్‌ బహిరంగ విచారణ జరుగుతుందని అంతా భావించినా… ఆరోగ్యరీత్యా వన్‌ టు వన్‌ విచారణ కోరారు కేసీఆర్‌. ఆయన విజ్ఞప్తిని అంగీకరించిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌… కేసీఆర్‌తో పాటు లోపలికి 9 మందికి అనుమతించింది. అయితే, చివరగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మా రావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు లోపలికి అనుమతించారు.ఇక, కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR.. కాళేశ్వరం తెలంగాణలో కాకుండా.. ఇంకెక్కడ కట్టినా కేసీఆర్‌కు అత్యున్నత పురస్కారం దక్కేదన్నారు కేటీఆర్‌. చిల్లర రాజకీయాలు చేసే పార్టీలు ఉన్నచోట కాకుండా, ఇంకెక్కడైనా కడితే.. గొప్ప గౌరవం దక్కేదన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రయత్నించిన కేసీఆర్‌పై కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయకుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కమిషన్ విచారణలో నిజాలన్నీ నిగ్గుతేలుతాయన్న కేటీఆర్‌.. ఈ పార్టీలకు ప్రజలకు తగిన బుద్ధి చెబుతాయని స్పష్టం చేశారు.మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణలో చివరి ఘట్టం ముగిసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన కమిషన్ 115వ వ్యక్తిగా కేసీఆర్‌ను ప్రశ్నించింది. ప్పటికే హరీష్ రావు, ఈటలను విచారించిన కమిషన్ .. కేసీఆర్‌ను కూడా విచారించడంతో… జస్టిస్‌ ఘోష్ కమిషన్‌ టాస్క్‌ కంప్లీట్‌ అయినట్టు తెలుస్తోంది. జులై నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో.. ఇక కమిషన్‌ కమిషన్‌ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.కరెక్టుగా 11గంటలకు బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు కేసీఆర్‌.. పదిగంటల తర్వాత ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి బయల్దేరిని కేసీఆర్‌… భారీ కాన్వాయ్‌గా హైదరాబాద్‌ బయలు దేరగా, ఆయనకు మద్దతుగా గులాబీ దండు వెంట నడిచింది. 12గంటలకు విచారణ ప్రారంభం కాగా… సరిగ్గా ఒక గంటల తర్వాత… బీఆర్కే భవన్‌ వెలుపలకు వచ్చారు.ఇక, కేసీఆర్‌ విచారణ సందర్భంగా… ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటీవల తండ్రికి లేఖరాసి వివాదం రేపిన ఎమ్మెల్సీ కవిత… తొలిసారిగా కేసీఆర్‌ను కలిశారు. భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌ను కలిశారు. ఇప్పటికే కేసీఆర్‌కి నోటీసులు నిరసిస్తూ ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నాచేసిన కవిత..ఇవాళ ఫామ్‌హౌస్‌కి వెళ్లి కేసీఆర్‌ను కలవడం ఆసక్తి రేపుతోంది.
పల్లా రాజేశ్వర రెడ్డికి పరామర్శ
విచారణ అనంతరం కేసీఆర్ నేరుగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఉదయం ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో బాత్రూమ్‌లో రాజేశ్వర్‌రెడ్డి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలు విరిగినట్టు తెలుస్తోంది. వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన్ని కవిత పరామర్శించి వచ్చారు. విచారణ అనంతరం కేసీఆర్‌ ఆసుపత్రికి వెళ్లారు. రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు.

Related Posts