
హైదరాబాద్, జూన్ 12,
హైదరాబాద్ వేగంగా విస్తరించే నగరాల్లో దేశంలో ఒకటి. ఎవరు పాలకులున్నప్పటికీ హైదరాబాద్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. 1990వ దశకం నుంచి వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం విస్తీర్ణం కూడా విపరీతంగా పెరిగింది. జనాభా కూడా అదే సమయంలో అంచనాలకు మించి దాటేసింది. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలికవసతులు కల్పించాలంటే అధికార పార్టీలకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. అన్నింటికీ అనుకూలమైన నగరంతో పాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉండటంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలకు చిరునామాగా మారడంతో హైదరాబాద్ కు రోజురోజుకూ జనం తాకిడి పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లు కూడా వెలుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ప్రధాన ఆదాయంగా వేలాది మందికి మారింది. ఇక్కడ గజం ధర ఇరవై లక్షలకు పైమాటే వీటిపైనే ఎక్కువ ఫోకస్... అయితే గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే డబుల్ బెడ్ రూంఇళ్లకు డిమాండ్ పెరిగింది. అయితే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన బిల్డర్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లు చదరపు అడుగులను అనుసరించి ధరలు పలుకుతున్నాయి. ఏరియాను బట్టి ముప్ఫయి నుంచి ప్రారంభమై అరవై లక్షల రూపాయల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు లభిస్తున్నాయి. అంటే ఒకరకంగా చూసుకుంటే చౌక ధరలకే డబుల్ బెడ్ రూం ఇళ్లు లభిస్తున్నాయి. 2023 సంవత్సరం వరకూ డబుల్ బెడ్ రూం ఇళ్లకంటే ట్రిబుల్ బెడ్ రూం ఇళ్లకు గిరాకీ ఉండేది. కానీ ప్రస్తుతం డబుల్ బెడ్ రూం ఇళ్లకు డిమాండ్ పెరిగిందని రియల్టర్లు చెబుతున్నారు. . ప్రాజెక్టులు పూర్తయినా డబుల్ బెడ్ రూం ఇళ్లు మిగిలి పోవడం లేదని బిల్డర్లు చెబుతున్నారు. ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లు కొనుగోలు చేయాలంటే కనీసం ఎనభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకుపైగానే వెచ్చించి రావాల్సి ఉండటంతో నివాసం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రాధాన్యత పెరిగింది. ఎక్కువ మంది ట్రిబుల్ బెడ్ రూం ఇళ్లకు వెళుతున్నారని బిల్డర్లు కూడా అటు వైపు మొగ్గు చూపడంతో ప్రస్తుతం డబుల్ బెడ్ రూం ఇళ్లు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఎక్కువగా జరుగుతుండటంతో వాటి ధరలను కూడా తగ్గించేందుకు బిల్డర్లు సిద్ధపడుతున్నారు. కనీసం తాము పెట్టిన పెట్టుబడి పైన ఐదు నుంచి పది శాతం లాభం ఉండేలా చూసుకుని విక్రయిస్తున్నారు వాటికే డిమాండ్ అట చదరపు అడుగు లెక్కన... డబుల్ బెడ్ రూం ఇళ్లు 800 చదరపు అడుగుల నుంచి పదిహేను వందల చదరపు అడుగుల వరకూ ఉంటున్నాయి. చదరపు అడుగుకు ఇంత మొత్తం చొప్పున ప్రాంతాన్ని బట్టి బిల్డర్లు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా కొంపల్లి, మేడ్చల్ ప్రాంతంలో ఎక్కువగా ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. కొంపల్లి ప్రాంతానికి మెట్రో రైలు కూడా వస్తుందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు. మరో వైపు హయత్ నగర్ వైపు కూడా ఇలాంటి ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. బోడుప్పల్ ప్రాంతంలో కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉండటంతో డబుల్ బెడ్ రూం ఇళ్లను కొనుగోళ్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో వీటికి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో గిరాకీ పెరిగింది.