
రంగారెడ్డి
స్కూల్ బస్సుల పై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కొరడా ఝుళిపించారు. స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. గురువారం నుండి పాఠశాలలు ప్రారంభం కావడం తో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సు పై ఫోకస్ చేసారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బస్సు ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నేస్, బీమాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్స్, అగ్నిమాపక యంత్రాలు, మెడికల్ కిట్లను తనిఖీ చేస్తున్నారు. 60 ఎళ్ళు పై బడిన డ్రైవర్ లపై సీరియస్ గా వ్యవరిస్తున్నారు. రాజేంద్రనగర్, అరమఘర్, అప్పా జంక్షన్, శంషాబాద్, షాద్నగర్ చేవెళ్ల, మియాపూర్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి.