
తాండూర్
తాండూర్ మండల్ లోని చంద్రపల్లి పాఠశాల గురువారం ప్రారంభంఅయ్యింది.విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు,దుస్తులు,బ్యాగులు పంపిణీ చేశారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపడం అభినందనీయమని అన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధనతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తొలిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు హెడ్మాస్టర్, టీచర్లు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు అర్ధమయ్యేలా విద్యా భోధన చేస్తున్నామని తెలిపారు. మెరుగైన వసతులు కల్పించడంతో పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని అన్నారు.అనంతరం పాఠశాల చైర్మన్ పెండ్యాల చంద్రకళ మాట్లాడుతూ ఇన్నాళ్లు ఆట పాటలు, తాత, అమ్మమ్మ, నానమ్మలతో హాయిగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. వేసవి సెలవుల తర్వాత పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు అడుగులు వేస్తున్నారు. అడుగిడుతున్న కొత్త విద్యా సంవత్సరంలో ఎప్పటిలాగే అన్ని పాఠశాలలు పున:ప్రారంభం.బోసిపోయిన బడి గోడలు కొత్త అందాలు సంతరించుకొన్నాయి. నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారుల కిలకిల రావాల ఆనందహేల గలగలా సవ్వడి చేసింది. అడుగులో అడుగు వేస్తూ బాల సైనికులు బడి ఒడిలోకి అడుగుపెట్టారు.దీంతో విద్యార్థులు తిరిగి బడిబాటపట్టనున్నారు. ఇన్నాళ్లు సెలవుల మజాను ఆస్వాదించి ఆటలు పాటలతో గడిపిన చిన్నారులంతా గురువారం నుంచి చదువుల ప్రపంచంలోకిఅడుగుపెట్టనున్నారు అన్నారు.సెలవుల్లో ఆటపాటలు..బంధుమిత్రుల ఇళ్లలో కాలక్షేపం చేసిన బాలబాలికలు నేటి నుండి మళ్లీ బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తు ప్రైవేటు పాఠశాలల ఆర్భాటపు ప్రచారాలకు ధీటుగా ఇంటింటికి తిరుగుతు తల్లిదండ్రులను కలిసి పిల్లలను సర్కార్ బడుల్లోనే చేర్పించాల్సిందిగా ప్రచారం సాగించారు అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దర్ శ్రీనివాస్,ఆర్ ఐ పద్మజా,పిల్లల తల్లిదండ్రులు చంద్రకళ,వనిత,
పాఠశాల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.