
ఖమ్మం
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాధపాలేం మండలంలోని 37 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని రఘునాధపాలెం మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందుకు అనుగునంగా అందరు కృషి చేయాలని . పదవులు అందరికి రావని, పని చేసే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరవేసుకునేలా చేస్తానని ఏ ఒక్కరు కంగారు పడవద్దని, కష్టపడే వాళ్లకు పదవులు వచ్చే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు. మీరు పదవులలో కూర్చుంటే మీరు నాకు ఇచ్చిన స్థానానికి విలువ ఉంటుందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగణన జరిగిందని, కులాగణన చేయగలిగిన దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉందని, రాహుల్ గాంధీ ఆలోచనలతో దేశ ప్రధాని మోడీ కులాగణన చెయ్యక తప్పడం లేదని, రేపు కర్ణాటక లో కులగణన జరుగనుందని, ఎస్సి జనాభా నిష్పత్తి ఆధారంగా ఉద్యోగాలు కూడా ఇస్తా అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని, అభివృద్ధి గురించి నాకు గుర్తు చేయడమే అది అవ్వడం అవ్వకపోవడం నేను చూసుకుంటానని, నేను గెలిచిన తర్వాత రోజు విడిచి రోజు మీ మధ్యలో ఉంటున్నానని, నాకు మీరు ఇచ్చిన గౌరవం జన్మ జన్మలకు మర్చిపోనని, మీ గ్రామాల్లో ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇచ్చిన ఘనత నాదే,ఇప్పటికే 5, 6 వందల కోట్ల నిధులు తీసుకుని వచ్చా రఘునాథపాలెం మండలానికి, ఇంకా ఎన్ని వందల కోట్లు అయినా తీసుకుని వస్తానని, 21 వేల కోట్లు రైతు బంధు కింద ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలతో పాటు కొత్త పథకాలు కూడా అందిస్తున్నామని,
ఉద్యోగస్తులు వారి బాకీలు, వారికి 5 డీఏ లు పెండింగ్ ఉన్నాయి వారికి 10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, అన్ని గత ప్రభుత్వం చేసి పోయిన ఘనతేనని అన్నారు. , అయిన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, మీనాక్షీ నటరాజన్ వచ్చిన నాటి నుండి కష్టపడే వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించారని, మొన్న ఇచ్చిన మంత్రి పదవులలోనూ అందరికీ అవకాశం ఇచ్చామని, పదవులు ఊరికే రావు కష్టపడే వారికే వస్తాయని అన్నారు.
మీరు ఏ గ్రామానికి రమ్మంటే ఆగ్రామానికి వస్తానని, మీరు ఐక్యంగా లేకుంటే మీ మధ్యలో బిఆర్ఎస్ వాళ్ళు గొడవ పెట్టీ వాళ్ళు ఎగేసుకుని పోతారని ముఖ్య కార్తల సమావేశంలో మంత్రి తుమ్మల అన్నారు.