
భీమవరం
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని మంగయ్య చెరువు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అర సెంటు స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు. పాలకోడేరులో సీసీ రోడ్ల ప్రారంభోత్సవా నికి విచ్చేసిన ఆయన పక్కనే నిర్మిస్తున్న భవనాన్ని చూసి అధికారులను ప్రశ్నించారు. గ్రామకార్యదర్శి గోపి సమాధానమిస్తూ ఈ భవనానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అయినా గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని చంద్రావతి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించేసారని తెలిపారు.
అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే మీరేం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. ఈ బిల్డింగును వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.