YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దమ్ముంటే నిరూపించండి

దమ్ముంటే నిరూపించండి

అమరావతి:
తల్లికి వందనం డబ్బులో రూ.2వేలు తన ఖాతాలో పడుతున్నట్లు చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని, లేకుంటే చట్టప్రకారం ముందకు వెళతానని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ వైసీపీకి సవాల్ విసిరారు. "తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీ పైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మీ ఫేక్ ప్రచారంపై కఠినమైన చర్యలు ఉంటాయి" అని వైసీపీని మంత్రి లోకేష్ హెచ్చరించారు.

Related Posts