YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సైప్రస్ కు మోడీ.. టార్గెట్ టర్కీ...

సైప్రస్ కు మోడీ.. టార్గెట్ టర్కీ...

న్యూఢిల్లీ, జూన్ 14 
జీ7 సదస్సుల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ కెనడాకు వెళ్లనున్నారు. మొదట ఈ సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందలేదు. అయితే జీ7 సభ్యదేశాల ఒత్తిడితో కెనడా తప్పనిసరి పరిస్థితిలో భారత్‌ను ఆహ్వానించింది. దీంతో మోదీ కెనడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. అతి చిన్న దేశంలోనూ పర్యటన షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్‌ 15-16న సైప్రస్‌ను సందర్శించారు, ఇది 23 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని చేసిన తొలి పర్యటన. జీ7 శిఖరాగ్ర సమావేశానికి (జూన్‌ 15-17కెనడా) వెళ్లే మార్గంలో సైప్రస్‌లోనూ పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సైప్రస్‌తో మనకు పెద్దగా వ్యాపార, సైకిన సంబంధాలు కూడా లేవు. కానీ, మోదీ ఈ దేశంలో పర్యటన ఖరారు చేసుకున్నారు. దీని వెనుక పెద్ద వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. టర్కీ-పాకిస్తాన్‌ ఐక్యతకు చెక్‌ పెట్టడానికి, టర్కీ శత్రు దేశాలైన సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో మైత్రిని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యగా నిలిచింది.2025 ఏప్రిల్‌ 22న పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సందర్భంగా టర్కీ పాకిస్తాన్‌కు సైనిక, రాజకీయ మద్దతు ఇచ్చింది. టర్కీ డ్రోన్‌ టెక్నాలజీ, ఆయుధ సరఫరాల ద్వారా పాకిస్తాన్‌తో సహకారాన్ని బలపరిచింది. ఈ నేపథ్యంలో, శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా.. టర్కీతో విభేదాలున్న సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో భారత్‌ సంబంధాలు రాజకీయంగా కీలకమయ్యాయి.మోదీ సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌తో చర్చలు జరుపుతారు. ఆర్థిక, వాణిజ్య, ఇండియా-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (IMEC)పై దృష్టి సారించారు. IMEC, టర్కీ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా, సైప్రస్, గ్రీస్‌ ద్వారా యూరప్‌ను మధ్యప్రాచ్యంతో కలుపుతుంది. సైప్రస్‌ ఈ కారిడార్‌లో భాగస్వామ్యం టర్కీకి ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని సృష్టిస్తుంది.
టర్కీ శత్రు దేశాలతో మైత్రి..
టర్కీకి సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో దీర్ఘకాల విభేదాలున్నాయి. 1974 టర్కీ ఆక్రమణ తర్వాత ఉత్తర సైప్రస్‌ వివాదం కొనసాగుతోంది. భారత్‌ సైప్రస్‌ ఐక్యత, సార్వభౌమత్వానికి యూఎన్‌ తీర్మానాల ద్వారా మద్దతిస్తుంది.తూర్పు మధ్యధరా సముద్ర సరిహద్దులపై టర్కీ-గ్రీస్‌ వివాదాలున్నాయి. భారత్‌-గ్రీస్‌ సైనిక, ఆర్థిక సహకారం బలపడుతోంది, రక్షణ ఒప్పందాలు విస్తరిస్తున్నాయి. ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ నాగోర్నో-కరాబాఖ్‌ వివాదంలో టర్కీ అజర్‌బైజాన్‌కు మద్దతిచ్చింది. భారత్‌ ఆర్మేనియాకు ఆయుధ సరఫరా, రాజకీయ మద్దతు ద్వారా టర్కీ ప్రభావాన్ని సమతుల్యం చేస్తోంది.
రాజకీయ, అంతర్జాతీయ ప్రభావం
సైప్రస్‌ 2026లో ఈయూ కౌన్సిల్‌ అధ్యక్షత వహించనుంది, ఇది భారత్‌-ఇయూ సంబంధాలను బలోపేతం చేస్తుంది. సైప్రస్‌ యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ శాశ్వత సభ్యత్వం, కాశ్మీర్‌ విషయంలో భారత్‌కు మద్దతిచ్చింది. పహల్గామ్‌ దాడిని ఖండించి, ఇయూ స్థాయిలో సరిహద్దు ఉగ్రవాద వ్యతిరేక చర్చలను ప్రోత్సహించింది.లిమాసోల్‌లో మోదీ, క్రిస్టోడౌలిడెస్‌ వ్యాపార సమావేశంలో పాల్గొన్నారు, రెండు దేశాల వ్యాపారవేత్తలను కలిపారు. సైప్రస్‌ మోదీకి ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ III’ అవార్డు ప్రదానం చేసింది. సైప్రస్‌ విభజన రేఖ సందర్శన టర్కీకి రాజకీయ సందేశంగా నిలిచింది.మోదీ సైప్రస్‌ సందర్శన టర్కీ-పాకిస్తాన్‌ ఐక్యతకు చెక్‌ పెట్టడానికి, సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో మైత్రిని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్య. IMEC, ఇయూ సహకారం ద్వారా భారత్‌ టర్కీ ప్రభావాన్ని సమతుల్యం చేస్తోంది. ఈ పర్యటన మధ్యప్రాచ్య, యూరప్‌లో భారత్‌ రాజకీయ, ఆర్థిక స్థానాన్ని బలపరిచింది.

Related Posts