
చెన్నూరు
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి గజ్వెల్, సిద్దిపేట, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దకాల్వల, పెద్దపల్లి, గోదావరిఖని, ఇందారం, రసూలుపల్లి, జైపూర్, వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు.
డీజే సప్పుళ్లు, బ్యాండ్ బాజా, డ్యాన్సు లతో భారీ గజమాలతో సత్కరించారు. వివేక్ మాట్లాడుతూ జైపూర్ మండల నాయకులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషం. ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేసానని గెలిపించారు. నేను ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా, అక్రమాలు లేకుండా అభివృధి చేస్తాను. ఇసుక దందా బంద్ చేయాలని ఏదైతే మీరు కోరారు నేను బంద్ చూపించడం జరిగింది. అందుకే ఇక్కడ నాకు మైనింగ్ మంత్రిగా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని అన్నారు. ఇసుక రాయల్ ట్యాక్స్ తో అధిక నిధులతో అభివ్రుద్ది చేస్తాను. ప్రజా పాలనలో ఎక్కడ కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం లేదు గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. నేను ప్రతీ గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్, 500 లకే గ్యాస్ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇస్తా అని మోసం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నానని అన్నారు.
ప్రభుత్వం మనకు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను విద్య పైన దృష్టి పెట్టీ సోమనపల్లి గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను మీకోసమే పని చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.