YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కిం కర్తవ్యం

జగన్ కిం కర్తవ్యం

విజయవాడ, జూన్ 19, 
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఈ సారి నేతల నుంచి వత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఉచిత పథకాలను మరింతగా ప్రకటించాలని నేతలు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. జగన్ హామీల విషయంలో చేతులు ముడుచు కూర్చుంటే ఈసారి కూడా అధికారంలోకి రావడం కష్టమేనని ఇప్పటికే కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా ఇటువంటి డిమాండ్లు ఊపందుకున్నాయి. జనం నాడిని పట్టి వెళ్లాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామా? లేదా? అన్నది పక్కన పెట్టి అధికారంలోకి రావాలంటే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వెళ్లడం మంచిదని ఇప్పటికే నేతలు అంటున్నారంటే రానున్న కాలంలో వైసీపీ నేతల నుంచి జగన్ పై మరింత వత్తిడి పెరిగే అవకాశముంది. బీజేపీతో పొత్తుకు జగన్ ప్రయత్నించాలని నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఎందుకంటే ఆయన క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలను పసిగట్టి ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఎలక్షనీరింగ్ కు కూడా ఇబ్బందులుండవన్న అభిప్రాయం కావచ్చు. ఎన్నికలో తమ హవా కొనసాగాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని ఆయన అన్నారు. అందులోనూ నిజం లేకపోలేదు. ఎందుకంటే బయట నుంచి మద్దతు ఇచ్చే కంటే ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ డిమాండ్ నేతల్లో పెరిగితే ఏం జరుగుతందన్నది మాత్రం చూడాలి.. ఇక అమరావతిపై మాజీ మంత్రి జోగి రమేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన నేరుగానే చెప్పారు. అమరావతిలో అభివృద్ధి చేయకుండా మూడు రాజధానుల నినాదంతో వెళ్లి పదకొండు సీట్లకే పరిమితం కావడానికి రాజధాని అంశం కూడా ఒక కారణమని ఆయన చెప్పకనే చెప్పారు. అమరావతిని మార్చేది లేదని, రాజధానిగా కొనసాగిస్తామని, మూడు రాజధానుల స్థానంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళితేనే ప్రయోజనం ఉంటుందని జోగి రమేష్ అన్నారంటే ఆ విషయంలోనూ జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? అన్నచర్చ జరుగుతుంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల్లో ఇదేరకమైన అభిప్రాయం ఉందంటున్నారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఉచిత హామీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలోనే తాను జగన్ కు చెప్పానని, మహిళలకు ఉచితబస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పాలని, మ్యానిఫేస్టోలో చేర్చాలని చెబితే అందుకు జగన్ అంగీకరించలేదన్నారు. ఫలితంగా చంద్రబాబు ఆ నినాదం అందుకుని విజయం సాధించారని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. 2014 ఎన్నికల్లోనూ రైతులకు రుణమాఫీ విషయంలో హామీ ఇవ్వాలని కోరామని, అప్పుడు కూడా జగన్ అంగీకరించకపోవడంతో పార్టీ ఓటమిపాలయిందని, ఉచిత హామీల విషయంలో ఈసారి జగన్ తన వైఖరి మార్చుకోక తప్పదంటున్నారు. ఎందుకంటే అధికారంలోకి రావాలంటే ఉచిత హామీలు ఇవ్వాలని నేతలు ఖచ్చితంగా వత్తిడి తెస్తారన్నది వాస్తవం. ఈసారి అధికారంలోకి రాకుంటే ఇబ్బందులు తప్పవని అందుకు చంద్రబాబుకు మించి హామీలు ఇవ్వాలని జగన్ పై వత్తిడి తెస్తారన్నది వాస్తవం.

Related Posts