YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా ఎన్‌ఆర్ ఐటీ భవనానికి భూమి పూజ

ఘనంగా ఎన్‌ఆర్ ఐటీ భవనానికి భూమి పూజ
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని భవిష్యత్‌లో ఇన్నోవేషన్‌ వ్యాలీగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని రాయపూడి వద్ద ప్రవాసాంధ్రులకు నిర్మించ తలపెట్టిన ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌ నిర్మాణానికి చంద్రబాబు శుక్రవారం భూమిపూజ చేశారు.‘ప్రవాసాంధ్రులు ఏ దేశంలో స్ధిరపడినా జన్మభూమిని మాత్రం మరిచిపోవద్దని... గతంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఐటీ రంగానికి  ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని చెప్పుకొచ్చారు. అందువల్లే ఎంతోమంది తెలుగువారు సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులుగా విదేశాల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారుఎన్‌ఆర్‌ఐలు ఎక్కడ స్థిరపడినా జన్మభూమిని మాత్రం మర్చిపోకూడదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలోని రాయపూడి దగ్గర ఎన్‌ఆర్‌ఐల కోసం నిర్మించబోతున్న ఎన్‌ఆర్‌టీ ఐకాన్ టవర్‌కు సీఎం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. తర్వాత సీఎం మాట్లాడారు. ‘గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఎంతోమంది తెలుగువారు సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులుగా విదేశాలకు వెళ్లారు. రాష్ట్రానికి చెందిన ఎంతోమంది ఇంజినీర్లుగా, వైద్యులుగా విదేశాల్లో సత్తా చాటుతున్నారుసాఫ్ట్ వేర్‌ రంగానికే ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఎక్కువమంది తెలుగువారే ఉండటం గర్వకారణం. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టాం.. ఇప్పుడు అమరావతిని అద్భుతమైన ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్నాం. అమరావతిని కూడా ఇన్నోవేషన్‌ వ్యాలీగా రూపుదిద్దుతాం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగువారు రాణించాలి. ప్రపంచానికి సేవ చేసే ఏకైక జాతి తెలుగుజాతే అని గుర్తింపు తీసుకురావాలి. ఎక్కడికెళ్లినా దేశాన్ని, పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోవద్దు ’అన్నారు సీఎం. రాయపూడి సమీపంలో ఐదు ఎకరాల్లో రూ.500కోట్ల అంచనాతో A ఆకారంలో ఈ ఐకాన్ టవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ భవనంలో మొత్తం 36 ఫ్లోర్లు ఉంటాయి. కొరియాకు చెందిన స్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ ఈ డిజైన్‌ను రూపొందించగా.. అటు ఇటు రెండు టవర్లు నిర్మించి.. మధ్యలో గ్లోబ్‌ వచ్చేలా ప్లాన్ చేశారు. ఎక్సో స్కెల్టెన్‌ విధానంలో నిర్మిస్తున్నఈ టవర్‌ ఫోర్ల మధ్యలో కాంక్రీటు పిల్లర్లు ఉండవట.. అందుకే మరో ఆరు శాతం ఎక్కువ స్థలం ఉంటుందని ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు అంటున్నారు. ఐటీ కంపెనీలు, ఆఫీస్‌లు, హోం, ఇన్ఫినిటీ స్విమ్మింగ్‌పూల్‌, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లతో ఈ ఐకాన్ టవర్ అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు. ఈ టవర్‌ ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు

Related Posts