YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బురద చల్లడానికే టీడీపీ దీక్షలు

బురద చల్లడానికే టీడీపీ దీక్షలు
రాష్ట్రంలో టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది. కడపలో స్టీల్ ప్లాంట్ కొరకు జీవీఎల్  నరసింహారావు నిరంతరం సమీక్షిస్తున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తున్న... బీజేపీ పై బురద జెల్లడానికే టీడీపీ దీక్షలు చేస్తోంని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం తెస్తే ఆ క్రెడిట్ బీజేపీ కి వెళ్తుందనే అలచనతో టీడీపీ నాయకులు డ్రామా దీక్షలు చేస్తున్నారు.  కడప ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్ రైల్వే జోన్ కి కేంద్రం కట్టుబడి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యం...ఏపీ బీజేపీ నాయకత్వం పోలవరం ని సందర్శించమని అయన స్పష్టం చేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విధివిధానాలు కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక పంపిస్తాం. ఏపీని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ ని రాజకీయంగా వాడుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏపీ వెనుకబడిపోతోంది. టీటీడీ విషయంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద ని అయన విమర్శించారు.  రమణదీక్షితులు వెనుక బీజేపీ ఉందన్న వార్తలు అవాస్తవం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక ఉచితం అని ప్రకటించి.. టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాని చెప్పడం వెనుక టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి కనబడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేస్తున్నాం. సంపత్ సే అభియాన్ అనే కార్యక్రమం తిరుపతి లో నిర్వహిస్తున్నామని అయన వెల్లడించారు. 

Related Posts