YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కంపెనీలు ఏర్పాటుకు అవసరమైన భూకేటాయింపులు

కంపెనీలు ఏర్పాటుకు అవసరమైన భూకేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ల్యాండ్ మేనేజిమెంట్ అధారిటీ సమావేశం మంగళవారం అమరావతి సచివాలయంలో ఇన్చార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ అనిల్ చంద్ర పునేఠ అధ్యక్షతన జరిగింది.వివిధ జిల్లాల్లో సంస్థలు,ఇతర కంపెనీలు ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయించాలని జిల్లా కలక్టర్ల నుండి అందిన ప్రతిపాదనలు మరియు ధరలకు అనుగుణంగా భూములు కేటాయిస్తూ ఈసమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యంగా ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్ మోహన్ సింగ్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.సత్యనారాయణ,సిసిఎల్ఏ అదనపు కార్యదర్శి యం.జగన్నాధం,టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ శాఖ సంచాలకులు శ్రీనివాసరావు,జైళ్ళ శాఖ ఐజి జయవర్ధన్,నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా పిడి శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts