ఎన్టీఆర్ జీవితాధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ బయోపిక్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ‘యన్టీఆర్’ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ని ఎంపికచేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయారని..ఆమె పాత్రలో కీర్తి తప్ప మరెవ్వరూ నటించలేరని చిత్రబృందం భావించిందట. హిందీ లోను ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.