మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 'యాత్ర' అనే సినిమా తెరక్కుతుంది. ఈ చిత్రంలో మలయాళం నటుడు మామూట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం రోజుకొక్క ఆసక్తికరమైన విషయం బయటకు వస్తుంది. అయితే ఇందులో వైఎస్సార్ తండ్రి పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించనున్నట్లు సమాచారం. మరోపక్క యాంకర్ అనసూయ కర్నూలుకు చెందిన రాజకీయనాయకురాలి పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.