విజయ్ దేవరకొండ, రష్మిక మందన జోడిగా కొత్త చిత్రం 'డియర్ కామ్రేడ్' ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి కొరటాల శివ, కీరవాణి, తదితరులు పాల్గొన్నారు.