హీరో రణ్బీర్ కపూర్ ప్రధానపాత్రలో సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిచిన 'సంజు' సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.తొలిరోజున రూ.34.75 కోట్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. కాగా, రెండోరోజు రూ.38.60 కోట్లు, మూడో రోజు (నిన్న) రూ.46.71 కోట్లు వసూలు చేసింది. 2018లో విడుదలైన సినిమాల్లో వారాంతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘సంజు’ నిలిచింది.