YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆది నుంచి పర్‌ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న భారత్.. ఎనిమిదో ఓవర్లో తొలి వికెట్‌ను సాధించింది. ఆచితూచి ఆడుతున్న ఓపెనర్ హషీం ఆమ్లా (16)ను జస్‌ప్రీత్ బుమ్రా ఎల్బీగా బలిగొన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. డుప్లెసి (13), క్వింటన్ డికాక్ (13) క్రీజులో ఉన్నారు. 

దక్షిణాఫ్రికాతో డర్బన్‌లోని కింగ్స్‌మెడ్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్ కోల్పోయి ఒత్తిడిలో ఉన్న భారత్.. ఎలాగైనా సిరీస్‌ను గెలవాలన్న కసితో బరిలోకి దిగుతుంటే.. టెస్టు సిరీస్ గెలుపు ధీమాతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. కాగా, పిచ్‌పై కాస్తంత గడ్డి ఉండడంతో ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలిస్తుందని చెబుతున్నారు. మరి, ఈ తొలి వన్డేలో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే. 

Related Posts