YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొందరివాడిగా మిగిలిపోతున్న పవన్

కొందరివాడిగా మిగిలిపోతున్న పవన్
నాకు కులం రంగు అంట‌గ‌ట్టాల‌ని చూడొద్దు.. నేను అంద‌రివాడిని` అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ఆవేశ‌పూరిత ప్ర‌సంగాలు గుర్తుచేసుకున్న వారంతా ఇప్పుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంద‌రివాడిన‌ని చెప్పిన ఆయ‌న‌.. కొంద‌రికే ప‌రిమిత‌మ‌య్యాడ‌ని చెబుతున్నారు. రాజ్యాధికారం కొన్ని సామాజిక‌వ‌ర్గాల చేతుల్లోనే ఉంటోంద‌ని, దీనిని రూపుమాపాల‌ని ఆయ‌న గ‌తంలో చెప్పిన ప‌వ‌న్‌.. తాను కూడా ఆ తాను ముక్క‌నే అని నిరూపించు కున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. పార్టీలోని కీల‌క ప‌దవుల నియామ‌కంలో ఆయ‌న వేసిన సామాజిక స‌మీక‌ర‌ణాలు, లెక్క‌లు త‌ప్పాయి. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం క‌ల్పించాల్సిన ఆయ‌న‌.. త‌మ‌ సామాజిక వ‌ర్గానికే పెద్ద పీట వేసి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కులం రంగు త‌న‌కు లేదంటూనే.. పార్టీ పొలిటిక‌ల్ ఎఫైర్స్‌ క‌మిటీ నియామ‌కంలో అస‌లు రంగు చూపించార‌ని కొంద‌రు మండిప‌డుతున్నారు.జనసేన ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత పార్టీలో ఓ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ `పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ`ని నియమించారు ప‌వ‌న్‌. పార్టీకి కనీసం ఓ లేయర్ వ్యవస్థనైనా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో సుదీర్ఘంగా కసరత్తు చేసి.. తాను చైర్మన్ గా, మాదాసు గంగాధరం కన్వీనర్‌గా మరో ముగ్గురిని సభ్యులుగా నియమించారు. ఇందులో తోట చంద్ర శేఖర్, మారిశెట్టి రాఘవయ్య, ఆష్రం యూసఫ్ ఉన్నారు. యూసుఫ్ మినహా మిగిలిన వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. పొలిటికల్ సెక్రటరీగా ప్రస్తుతం మీడియా అడ్వైజర్ గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ ను నియమించారు. ఆయన కూడా అదే సామాజికవర్గం. ఇలా పవన్ కళ్యాణ్ తమ సామాజికవర్గానికి ఉన్నత స్థాయిలో సంపూర్ణ న్యాయం చేశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.స్టేట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ గా 15 మందిని, స్టేట్ బూత్ కోఆర్డినేటర్లుగా ఐదుగురిని, జనసేన లీగర్ కమిటీ చైర్మన్ గా కె. చిదంబరం అనే వ్యక్తిని నియమించారు. వీరిలో ఒక ముస్లిం, ఒకరిద్దరు బీసీ నేతలున్నారు. కానీ ఇతర సామాజిక వర్గాలకు అవకాశం దక్కలేదు. ఇక కొత్త అధికార ప్రతినిధిగా సీనియర్ జర్నలిస్ట్ విజయబాబును నియమించారు. ఆయన కూడా పవన్ న్యాయం చేసే సామాజికవర్గానికి చెందిన వారే. తనకు కులం లేదని చాలా ఆవేశంగా ప్రకటించే పవన్ కల్యాణ్.. అధికారం ఒక్కరిదేనా అని ఆవేశంగా ప్ర‌సంగాలు ఇస్తూ ఉంటారు. అధికారం అందరిదీ అని నినదిస్తూ ఉంటారు. కానీ ఆచరణలో మాత్రం తన జనసేన కమిటీల్లోనే న్యాయం చేయలేకపోయార‌ని పార్టీలో గుసగుస‌లు మొద‌ల‌య్యాయి.ఓ పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థలో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ఆనవాయితీ. కానీ పవన్ మాత్రం ఐదుగురిలో నలుగురిని ఒకే సామాజికవర్గం వారికి చోటు కల్పించారు. ఈ కమిటీలు చూసిన తర్వాత జనసేన కోసం ఇంత వరకూ పని చేసిన వారు నిరాశకు గురయ్యారు. కులం గోడలను పవన్ బద్దలు కొట్టేస్తారని నమ్మితే.. తన వర్గానికే సామాజిక న్యాయం చేసే యజ్ఞాన్ని ప్రారంభించారని ఉసూరుమంటున్నారు. పదవిలో నియమించే ముందు కులాలు చూడనని పవన్ చెప్పుకోవడం బాగానే ఉన్నా.. రాజకీయాలు మాత్రం కచ్చితంగా చూస్తాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Posts