YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెన నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెన నిర్మాణాలు           రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రోడ్లు, వంతెనల నిర్మాణాల్లో సాంకేతికతకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యంలోగా ఆ నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కనెక్టవిటీ ప్రాజెక్టులపై గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాల ప్రగతిని రాష్ట్ర హోం శాఖ సలహాదారు దుర్గా ప్రసాద్...సీఎస్ దినేష్ కుమార్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 119 రోడ్లు, 9 బ్రిడ్జి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. వాటిలో 7 రోడ్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు. 64 రోడ్ల పనులు టెండర్ల దశలలో ఉన్నాయన్నారు. మిగిలిన 48 రోడ్ల నిర్మాణాలకు అటవీ, ఆర్అండ్ బిశాఖ అనుమతులు రావాల్సి ఉన్నాయన్నారు. మైదాన ప్రాంతాలతో పాటు ఎత్తయిన ప్రాంతాల్లో వివిధ పద్ధతిలో చేపట్టే రోడ్ల నిర్మాణాలను సీఎస్ కు ఆయన వివరించారు. సీలేరులో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణా పనుల ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, నవంబర్ లోగా సీలేరులో నిర్మించిన వంతెన పనులు పూర్తి చేయాలని ఆర్అండ్ బి అధికారులకు ఆదేశించారు. రోడ్లు, వంతెనల నిర్మాణాల్లో సాంకేతికతకు పెద్దపీట వేయాలన్నారు. దీనివల్ల పనులు సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల్లో అలక్ష్యం చూపొద్దన్నారు. త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. అటవీ, ఆర్ అండ్ బి శాఖల నుంచి అనుమతుల కోసం సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలన్నారు. అన్ని రోడ్లు, బ్రిడ్జి పనులను 2020 మార్చి నాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖాధికారులకు సీఎస్ దినేష్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, రాష్ట్ర హోం శాఖ అడ్వయిజర్ దుర్గాప్రసాద్, ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. 

Related Posts