YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

2 నుంచి జగన్ శంఖారావం

2 నుంచి జగన్ శంఖారావం
ఆంధ్ర ప్రదేశ్ లో అధికారమే లక్ష్యంగా ముందుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళికతో ముందుకుపోతోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించనుంది. ఆగస్టు 2న వైసీపీ ప్రచారానికి జగన్ శంఖారావం పూరించనున్నారు. మొదటి దశలో మూడు నెలల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. ‘నిన్ను నమ్మం బాబు’ అనే నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతోంది. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు గ్రామగ్రామానికి ఆ పార్టీ వెళ్లనుంది. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకురానున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఈనెల 29న తూర్పు గోదావరి జిల్లా జగ్గయ్యపేటలో అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే ఆయన వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ప్రచారం కోసం ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, గుంటూరు, వైజాగ్ లలో వాహనాలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచే పటిష్ఠ ప్రణాళికతో భారీ కసరత్తు చేస్తున్నట్లు కనపడుతోంది.

Related Posts