YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ యువకుడు ఆత్మహత్య

ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ యువకుడు ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ చిత్తూరుకు చెందిన యువకుడు సుధాకర్(26) ఆత్మహత్య చేసుకున్నారు. మదనపల్లెలోని రామాపురం కాలనీకి చెందిన రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూసి కలత చెందిన సుధాకర్ శనివారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.‘నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్ నోట్ రాసిన సుధాకర్ ప్రాణాలు తీసుకున్నారు. మదనపల్లెలో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న సుధాకర్.. ప్రత్యేక హోదా కోసం జరిగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. చనిపోయే ముందురోజు కూడా ఓ అనాథాశ్రమానికి రూ.5 వేలు విరాళం ఇచ్చారు. ఆయన తల్లిదండ్రులు మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో సుధాకర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంతకుముందు ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతికి చెందిన మణి కోటయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Related Posts