YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్డీయే వ్యతిరేకంగానే వైసీపీ ఓటు..!!

ఎన్డీయే  వ్యతిరేకంగానే వైసీపీ ఓటు..!!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తాము ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్డీయేతర, యూపీయేతర పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ప్రతి ఓటూ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. తమ అభ్యర్థిని గెలిపించుకోవడం అధికార ఎన్డీయేకు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే రాజ్యసభలో ఎన్డీయేతర సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తటస్థ పార్టీల ఓట్లు చాలా కీలకంగా మారాయి.  ఇరు పక్షాలూ ఇప్పటికే ఈ ఓట్ల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ పరిణామాల మధ్యన తాము ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ఆసక్తిదాయకంగా మారింది.రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని, ఆ పార్టీ మోసపూరిత వైఖరికి నిరసనగానే తాము ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో జేడీయూ పార్టీకి చెందిన నేతను అభ్యర్థిగా బరిలోకి దించింది ఎన్డీయే. ఈ మేరకు జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతు కోసం వివిధ పార్టీలను సంప్రదిస్తున్నారు.

Related Posts