YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరులో వైసీపీ నేతల అరెస్ట్..!!

గుంటూరులో  వైసీపీ నేతల అరెస్ట్..!!

గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, దాచేపల్లిలో అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు ఈ రోజు ఉదయం బయలుదేరిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వైసీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్యే డా.గోపి తదితరుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. నరసారావు పేట ఎమ్మెల్యే డా.గోపి రెడ్డి మాట్లాడుతూ.. యరపతినేని అవినీతిలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కు వాటా ఉందని తెలిపారు. గత నాలుగేళ్లుగా గుంటూరులో అక్రమ మైనింగ్ యధేచ్ఛగా సాగుతోందని విమర్శించారు.

Related Posts