YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

అవగాహనతో క్యాన్సర్ మాయం

అవగాహనతో క్యాన్సర్ మాయం

- ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం

- విస్తృత అవగాహన కార్యక్రమాలు

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా ఆదివారం విస్తృత అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మలక్‌పేట యశోద ఆస్పత్రి, యశోద క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో 5కే రన్‌ నిర్వహించారు. సినీనటులు సంపూర్ణేష్‌ బాబు, నిఖిల్‌, సన, రహస్య గోరఖ్‌, ఆస్పత్రి సీఈఓ ధీరజ్‌, డైరెక్టర్‌ లింగయ్య పాల్గొన్నారు.

 ఉస్మానియా దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులో అవగాహన నడకను వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డా.రమేష్‌రెడ్డి ప్రారంభించారు.ప్రిన్సిపల్‌ డా.పి.బాల్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

 స్వస్థత క్యాన్సర్‌ కేర్‌ ఆధ్వర్యంలో అవగాహన నడకను కేబీఆర్‌ జాతీయ ఉద్యానవనం వద్ద నిర్వహించారు. స్వస్థత క్యాన్సర్‌ కేర్‌ అధ్యక్షులు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌పీ సింగ్‌, ప్రధాన కార్యదర్శి చతుర్వేది, రోటరీ డిస్ట్రిక్ట్‌ 3150 గవర్నర్‌ అబ్రహం పాల్గొన్నారు.

Related Posts