పరిపూర్ణానంద స్వామీజీ నగర బహిష్కరణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని అభ్యర్థిస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కావాలంటే కైంటర్ దాఖలు చేసుకోవాలని సూచించిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. సెప్టెంబర్ 4వ తేదీన స్వామీజీ పునరాగమనాన్ని పురస్కరించుకొని స్వాగత సన్నాహాలు చేస్తున్న హిందూ సంఘాల నాయకులు ఈతీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.