జారీచేసిన మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా మరణించినవారి ఓటర్లను జాబితా నుండి నేరుగా తొలగించవచ్చని, అయితే తొలగించే ఓట్ల సమాచారాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శించడంతో పాటు సి.ఇ.ఓ కార్యాలయానికి, రాజకీయ పార్టీలకు జాబితాను పంపి ఏడు రోజుల్లోగా అభ్యంతరాలు తెలియచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. నేడు హైదరాబాద్ జిల్లాలోని ఓటరు నమోదు అధికారులతో సెల్ కాన్ఫ్రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలగించిన ఓటర్ల వివరాలను అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలని అన్నారు. తమ పరిధిలో ఒకే ఇంటిలో అధిక మొత్తంలో ఓట్లు ఉంటే ఆయా నివాసాలను వ్యక్తిగతంగా వెళ్లి ఓటర్లను తనిఖీ చేయాలని సూచించారు. వీటితో పాటు 90ఏళ్లకు పైబడ్డ ఓటర్లను కూడా మరోసారి పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో వీఐపీ ఓటర్లను కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు.