కర్నూలులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా అయన పెదపాడులోని సంజీవయ్య ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సంజీవయ్య ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా రాహుల్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. రాహుల్ తోపాటు సంజీవయ్య ఇంటికి రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి తదితర నేతలు కూడా వెళ్లారు.