YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

చిదంబర రహస్యం !

చిదంబర రహస్యం !

తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ , అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలా మందికి తెలుసు. కానీ అందరినీ అత్యంత ఆశ్చర్య చకితుల్ని చేసే ఎన్నో గొప్ప విశేషాలు .ఈ ఆలయమునకు సంబంధించి ఉన్నాయి. అవి ఏమిటో ఒక్కసారి చదవండి.

చిదంబర రహస్యం !
( ఆలయం ఒక అద్భుతం ) 
.చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు .ఈ విషయాన్ని తన గ్రంధం " తిరుమందిరం " లో 
ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు. ఇపుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ! ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది 
." పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు .అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే...!ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి . అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి ఇది ఆశ్చర్యం కదూ ! చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి .

మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి...........
.చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 ) ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు .మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది .దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం .అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి .అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది." కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు .ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి.64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు 
.9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు .అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు .మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.

Related Posts