YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

వ్యూహాలు రచిస్తున్నచంద్రబాబు

 వ్యూహాలు రచిస్తున్నచంద్రబాబు

- వేడెక్కిన ఏపీ రాజకీయాలు..

-  నేతలతో చంద్రబాబు అత్యవసర భేటీ

 ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్-6న రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చిచెప్పడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో టీడీపీపై ఒత్తిడి పడింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు, పవన్ దూకుడు, భవిష్యత్ కార్యచరణపై నిశితంగా చర్చించనున్నారు. రెవెన్యూ లోటు విషయంలో న్యాయపోరాటం చేసే అంశంపైనా చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా జగన్ పార్టీ ఎంపీల రాజీనామాలతో, ఆయన వ్యాఖ్యలకు ఎలా స్పందిచాలనే దానిపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశముంది.

Related Posts