
విజయవాడ, జూన్ 17,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరొకసారి ఐప్యాక్ పై ఆధారపడుతున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఈసారి కూడా ఐ ప్యాక్ టీంతో నే ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని తనకు అప్పగించడమే కాకుండా ఎప్పటికప్పడు నివేదికలను అందించడానికి ఐ ప్యాక్ టీం ను తిరిగి యాక్టివ్ చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు గత ఎన్నికల్లో పనిచేసిన వారిని ఈసారి కూడా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోసారి సర్వేలకు రెడీ అవ్వాలని ఐ ప్యాక్ టీంను ఆదేశించినట్లు తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఐప్యాక్ కార్యాలయాన్ని కూడా తీసి వేశారు. అయితే తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. జనంలో మంచి ఊపు ఉందని, అయితే ఫీల్డ్ లెవెల్ లో తనకు ఖచ్చితమైన సమాచారం తెలియాలంటే ఐ ప్యాక్ టీం అవసరాన్ని గుర్తించిన జగన్ మరోసారి దానిని రంగంలోకి దించాలని నిర్ణయించారని తెలిసింది. త్వరలోనే ఐ ప్యాక్ టీం తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమాలను ప్రారంభిస్తుందని కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు 2019లో అధికారాన్ని తెచ్చిపెట్టిన ఐ ప్యాక్ సంస్థ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత దుకాణం మూసివేసింది. ఈ సంస్థ బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ దే అయినప్పటికీ ఆయన 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. దీంతో ఐప్యాక్ సంస్థలో పనిచేసిన వారు దానిని నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికలకు కూడా వైఎస్ జగన్ మరోసారి గెలిచేందుకు ఐప్యాక్ సంస్థను కొనసాగించారు. ఐప్యాక్ సంస్థకు రుషిరాజ్ నేతృత్వం వహించారువారి ఖాతాల్లో మరికొంత నగదు మళ్లీ రుషిరాజ్ నేతృత్వంలోనే? తిరిగి రుషిరాజ్ నేతృత్వంలోనే ఐ ప్యాక్ సంస్థ పనిచేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. జనాభా గణన మొదలు కానుండటంతో పాటు 2027లో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో జమిలి ఎన్నికల నేపథ్యంలో ఐ ప్యాక్ ను త్వరగానే రంగంలోకి దించాలని వైఎస్ జగన్ భావిస్తున్నార. ఎప్పటి లాగానే ఐ ప్యాక్ సంస్థ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ, సోషల్ మీడియాలో ప్రచారం వరకూ అంతా తానే చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఒక్కోసారి వైఫల్యాలు ఉంటాయని, అది జనం మనసులను అంచనా వేయడంలో తప్పు అయినా, దాని అవసరం తమకు ఉందని గుర్తించిన జగన్ తిరిగి ఐ ప్యాక్ ను రెడీ చేస్తున్నట్లు తెలిసింది.