
విజయవాడ
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన ఒక సువర్ణ అధ్యాయం గా అభివర్ణించారు . జాతీయ స్థాయిలో కాంగ్రెస్, రాష్ట్రంలో వైసీపీ ఉనికిని కోల్పోతున్నాయి . వికసిత్ భారత్ కి అమృత కాలం. పేదల సంక్షేమం భారత దేశం గౌరవం నిలబెడుతూ ప్రధాని పాలన కొనసాగుతుంది. రైతుల సంక్షేమం కొరకు ప్రధాన ద్యేయం గా పాలన ఉంటుంది. ఆర్థిక రంగంలో 4వ స్థానానికి ప్రధాని మోదీ తీసుకొచ్చారన అన్నారు. సేవా,సంక్షేమ కార్యక్రమాలతో ఆత్మ నిర్భర్ భారత్ గా మోదీ పరిపాలిస్తున్నారు . జల జీవన్, ఆయుష్మాన్ భారత్, ఇలా అనేక కేంద్ర పథకాలతో పేదలకి మంచి చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో గత ప్రభుత్వలకి భిన్నంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తో రక్షణ రంగంలో ఎంత ప్రగతి సాధించామో ప్రపంచ దేశాలకి చాటి చెప్పామని అన్నారు.మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా లో భాగంగా రక్షణ రంగంలో కావలసిన పరికరాలని మనం సమకుర్చుకున్నాం. చినాబ్ నది పై సాంకేతిక పరిజ్ఞానం తో వంతెన నిర్మాణం చేపట్టడం జరిగింది. మోదీ పాలన లో ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో 3వ స్థానానికి రానుంది. నారీ వ్యవస్థలో మైనారిటీ మహిళలకి, మహిళలకి సమూచిత స్థానాన్ని కలిపించారు. ఆపరేషన్ సింధూర్ లో ఇద్దరు మహిళలు నాయకత్వం వహించి సుదీర్ఘ కాలం తరువాత జనగణన కి గజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కులగణన చేపట్టడం జరిగింది. వీటిపై అవగాహన లేకుండా కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ప్రపంచం దేశాలకి భారత దేశాన్ని విశ్వ గురు దేశంగా చూపించేలా మోదీ చేసారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం నాయకత్వం లేదు. దేశ అభివృద్ధి పై కాంగ్రెస్ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూసేలా మోదీ చేసారు . ప్రపంచ రికార్డ్స్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకునేలా మోదీ ప్రణాళికలు చేసారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ సంఖ్యలో యోగా చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు . రాష్ట్ర ప్రజలందరూ యోగా లో భాగస్వామ్యం అవ్వాలని బీజేపీ పిలుపినిస్తుందని అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు పాల్గొన్నారు