YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సర్క్యులర్ ఎకానమీపై సీఎం చంద్రబాబు సమీక్ష

సర్క్యులర్ ఎకానమీపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ
సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వ్యర్ధాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై సమీక్షలో చర్చ జరిగింది. రాష్ట్రంలో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ యోచన చేస్తోంది. ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై రాష్ట్రం దృష్టి పెట్టింది. మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాల నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా కేంద్రం కార్యాచరణ రూపొందించింది. వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

Related Posts