
షాద్ నగర్
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ టైపింగ్ వ్యవహారం షాద్ నగర్ పట్టణం రాజకీయానికి తగిలింది. బీజేపీ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి టికెట్ ఆశించి, టికెట్ రాకపోవడంతో ఫార్వార్డ్ బ్లాక్ నుండి ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల అనంతరం తిరిగి బీజేపీ గూటికి చేరారు.
విష్ణువర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ... ఈనెల 14వ తేదీన తనకు జూబ్లీహిల్స్ పోలీసుల నుండి నోటీసు అందిందని, పోలీసు విచారణ జాబితాలో తన ఫోన్ నెంబర్ ఉందని, దీనిపై విచారించాలని పిలుపురాగా ఆ నోటీసు అందుకొని విచారణకు హాజరైనట్లు తెలిపారు. నవంబర్ 15 నుండి 30వ తేదీ వరకు సంబంధించిన మీ ఫోన్ డేటా వివరాలు తమ వద్ద ఉన్నాయని, అంతకు ముందు ఉన్న డేటా లేదని పోలీసులు విచారణలో చెప్పినట్లు తెలిపారు. తన నెంబర్ 9618567566 నెంబర్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు ధ్రువకరించినట్లు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆ మధ్య కాలంలోనే తనపై 8 ఎన్నికల కేసులు ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు కూడా విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో తన ఫోన్ ను చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ చేసిన వారు ఎవరైనా సరే, ఎంత పెద్దలైనా సరే, ఏ పార్టీ వారు అయినా సరే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన గోప్యతను భంగపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. ముఖ్యంగా తన ఫోన్ ట్యాపింగ్ జరిగాక తాను ఎవరెవరితో ఏం మాట్లాడానో, ఎన్నికల్లో జర్నలిస్టులు, ముఖ్య నేతలు, అధికారులు, తన బంధువులు, పార్టీ కార్యకర్తలు, తన భార్యాపిల్లలు ఎవరెవరితో సంభాషించానో వీటన్నింటినీ దొంగచాటుగా విని తన ప్రాథమిక హక్కును హరించారని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను ఇంకా దీనికి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.