YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

కుంభమేళాకు రూ.1500 కోట్లు 

Highlights

  • బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపు
  • కుంభమేళాకు యునెస్కో గుర్తింపు 
  •  ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం 
కుంభమేళాకు రూ.1500 కోట్లు 

కుంభమేళాకు రూ.1500 కోట్లు 
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అల‌హాబాద్‌లో నిర్వ‌హించే ప్రఖ్యాత  కుంభమేళాను ఘనంగా జ‌రిపేందుకు సంకల్పించింది. ఇందుకు  బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌లో కుంభమేళా కోసం రూ.1500 కోట్లు ప్రకటించింది. మొత్తం రూ.4,28,38,452 కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర‌ ఆర్థిక మంత్రి రాజేశ్ అగర్వాల్ ప్రవేశపెట్టారు.

ఈ బ‌డ్జెట్‌లో విద్య‌, ప‌వ‌ర్ సెక్టార్‌కు ఎక్కువ‌గా నిధులు కేటాయించింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అలహాబాద్‌లో 2019లో కుంభమేళాను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. దీని కోసం ఇప్పటి నుంచే యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చివరిసారిగా 2013లో కుంభమేళా జరగ్గా దాదాపు 10 కోట్ల మంది భ‌క్తులు హాజరయ్యారు. ఈ సారి ఆ సంఖ్య 12 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కుంభమేళాకు కొద్దిరోజుల క్రితం యునెస్కో గుర్తింపు కూడా లభించిన విష‌యం తెలిసిందే.

Related Posts