YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ

Highlights

  • రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేయించాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారు
  • ఆరోగ్య పరీక్షలు చేసి ఆరోగ్య కార్డులు అందచేయడం ద్వారా ముందే వ్యాధులను గుర్తిస్తారు
  • ప్రతి విద్యార్థికి విద్యాశాఖ తరపున ఆరోగ్య పరీక్షలు చేసి ఆరోగ్య కార్డులందిస్తాం
  • విద్యార్థులకు ఆరోగ్య పరీక్షల్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్, తెలంగాణ చాప్టర్ స్వచ్ఛందంగా సహకరించాలి
  •  ప్రజలు, విద్యార్థుల్లో దంత సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి
  •  షియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటలాజిస్ట్స్’’ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, 
  •  సిఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన  కడియం 
విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ

 తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేసి, ఆరోగ్య కార్డులు అందించాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారని తెలిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటలాజిస్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినం సందర్భంగా నిర్వాహకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో సిఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. 


తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, విద్యాశాఖ ద్వారా వారికి ఆరోగ్య కార్డులు అందించాలని ప్రయత్నిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రజారోగ్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చాక అమలు జరుగుతున్న కేసిఆర్ హెల్త్ కిట్స్ వల్ల ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కేసిఆర్ కిట్స్ తో పాటు గర్భిణీ స్త్రీలకు ఆరు నెలల పాటు రెండు వేల రూపాయలు చొప్పున 12వేల రూపాయలు ఇవ్వడం, ప్రసవం అనంతరం తల్లి, బిడ్డకు కావల్సిన 15 రకాల ఉత్పత్తులతో కిట్ అందించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. 


    ఇండియన్ డెంటల్ అసోసియేషన్, తెలంగాణ చాఫ్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ వల్ల దంత సంరక్షణపై అవగాహన పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అయితే ప్రజల్లో దంత సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు. విద్యాశాఖ పరంగా విద్యార్థులకు ఆరోగ్య కార్డులు ఇచ్చే సందర్భంలో దంతపరీక్షలకు సంబంధించి స్వచ్ఛందంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ వారి సేవలు అందించాలన్నారు.  ఈ సమావేశంలో కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కరుణాకర్, ఇతర డాక్టర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts