యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బీడీ కాలనీ లో నీళ్లు రావట్లేదని మహిళలు ధర్నా నిర్వహించారు వారం రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదని కౌన్సిలర్ కు నగర పంచాయతీ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు మిషన్ భగీరథ నీళ్లు కూడా రాకపోవడంతో ఇబ్బందిగా ఉందని పిల్లలను పాఠశాలలకు స్నానాలు చేయించకుండానే పంపిస్తున్నామని బీడీ కాలనీ కి నీళ్లు సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు