YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఒంగోలు రేపిస్ట్ వైఎస్ కార్యకర్త : లోకేష్

ఒంగోలు రేపిస్ట్ వైఎస్ కార్యకర్త : లోకేష్

ప్రకాశం జిల్లా ఒంగోలులో 16 ఏళ్ల బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితుల్లో బాజీ అనే వికలాంగ యువకుడు కూడా ఉన్నాడు. ఇతనికి రెండు చేతులూ లేవు. కానీ, ఒక అమాయికురాలిని నిర్బంధించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి తోడు, గతవారం తెలంగాణలోని హన్మకొండలో 9 నెలల చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఫేస్‌బుక్‌లో బాజీ ఒక పోస్ట్ పెట్టాడు. ‘చాలా బాధగా ఉంది. వాడిని చంపేయండన్న ప్లీజ్’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇలాంటి నీతి వాక్యాలు పలికిన తానే ఒక బాలికను అత్యాచారం చేసిన గుంపులో భాగమయ్యాడు. కేసులో ఇరుక్కున్నాడు. బాజీపై ఇప్పటికే నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నీతులు చెప్పిన నీవే ఇంతటి దారుణానికి ఒడిగడతావా అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా, బాజీ ఫేస్‌బుక్ పేజ్‌ను పరిశీలిస్తే దాని నిండా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ లోకల్ లీడర్స్ ఫొటోలు, వారితో బాజీ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆఖరికి వైఎస్.యస్.జగన్‌తో తీసుకున్న సెల్ఫీ కూడా ఉంది. ఈ పేజ్‌లోని ఫొటోలు, స్క్రీన్‌ షాట్లను ఆధారంగా చేసుకుని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. జగన్ గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది’ అని తన ట్వీట్‌లో నారా లోకేష్ పేర్కొన్నారు.

Related Posts